BREAKING
తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం
www.ntodaynews.com

ఒక గంటలో నీ అల్లుడ్ని ఎగిరిస్తా... చూస్తావా?” అంటూ అత్తకు బెదిరింపులు?...

ఆంధ్రప్రదేశ్
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Aug, 2026 - 10:41 AM
6 వీక్షణలు

ఒక గంటలో నీ అల్లుడ్ని ఎగిరిస్తా... చూస్తావా?” అంటూ అత్తకు బెదిరింపులు?...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు నియోజకవర్గం,

చౌడేపల్లి మండలం.

ఎవరు పిటీషన్ పెట్టినా... నింద అతని పైనే నెట్టడమేనా..? 

గోప్యత విధానం పాటించని పోలీసుల పై చర్యలు తీసుకోండి

చౌడేపల్లి మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యమైన ఘటనపై నమోదైన మిస్సింగ్ కేసు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.వివరాల ప్రకారం.. మైనర్ బాలిక తన ప్రియుడితో వెళ్లిపోయినట్లు సమాచారం అందడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అనంతరం బాలికను గుర్తించి, తల్లిదండ్రుల సమక్షంలో సీడీసీకి అప్పగించినట్లు తెలుస్తోంది.అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఈ వ్యవహారంపై ఎవరో మానవ హక్కుల సంస్థకు ఫిర్యాదు చేశారని,అందులో జేమ్స్(పేరు మార్చబడినది)ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పినట్లు బాలిక తండ్రి పేర్కొన్నట్లు సమాచారం.దీంతో జేమ్స్ అత్త (అనిత పేరు మార్చడమైనది)ను బాలిక తండ్రి బెదిరించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. “ఒక గంటలో నీ అల్లుడ్ని ఎగిరిస్తా... చూస్తావా?” అంటూ బెదిరించినట్లు వారి అత్త ఆరోపించినట్లు సమాచారం.ఈ ఘటన గ్రామంలోని ఓ పెద్దమనిషి (సోమన్న పేరు మార్చడమైనది)సమక్షంలో చోటుచేసుకున్నట్లు, అక్కడికి వచ్చిన పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు సదరు పెద్దమనిషి వెల్లడించినట్లు సమాచారం.ఏదైనా సమాచారం అందిస్తే పోలీసలు గోప్యతా విధానం పాటించాల్సిన అవసరం ఉందా? లేదా? ఐతే ఎవరో చేసిన పనిని ఇంకో వ్యక్తి పైకి నెట్టిన పోలీసల పై తక్షణ చర్యలు తీసుకోవాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశారు.ఈ విషయాన్ని ఇతటితో ఆపేది లేదని,సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అన్ని ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు పిర్యాదు చేయనున్నట్లు సదరు వ్యక్తి తెలియజేశారు.

ఎస్సైని సంప్రదించిన సదరు వ్యక్తి 

ఈ విషయంపై సదరు వ్యక్తి వెంటనే చౌడేపల్లి ఎస్సైను చరవాణిలో సంప్రదించినట్లు తెలిపారు.తన పేరు ఎవరు చెప్పారని,ఇంతకు ప్రశ్నించగా, “ఏదో మానవ హక్కుల సమితి పేరుతో వచ్చింది” అని ఎస్సై తెలిపినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నారు.అయితే మైనర్ బాలిక విషయంలో ఎవరు ఫిర్యాదు చేశారు? పోలీసులకు అసలు సమాచారం ఎలా చేరింది? ఆ వ్యక్తి పేరు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి.

సమగ్ర విచారణకు డిమాండ్

ఈ వ్యవహారంలో మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఆరోపణలు,పోలీసుల వివరణ,అలాగే ఫిర్యాదు చేసిన వ్యక్తి లేదా సంస్థ వివరాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.అదేవిధంగా బెదిరింపుల ఆరోపణలపై కూడా విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇదేనా పోలీసుల పని తీరు ఈ విషయాన్ని సోమవారం లోపల పరిష్కారం చేయకపోతే సోమవారం జిల్లా ఎస్పి ని కలసి సదరు పోలీసుల పైన పిర్యాదు చేయనున్నట్లు సదరు వ్యక్తి తెలియజేశారు. అంతే కాకుండా బెధిరించిన వ్యక్తి కులదృవీకరణ పత్రం పైన కూడా పలు అనుమానాలు ఉన్నాయని సంబందించిన రెవిన్యూ అధికారులకు పిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు.