ఒకే వేదిక మీదకు వైఎస్సార్ ఫ్యామిలీ..!
ఆంధ్రప్రదేశ్ | NTODAY NEWS
రాష్ట్ర రాజకీయాల్లో 2029 ఎన్నికల నేపథ్యంలో సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఒకే వేదికపైకి రానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జూలై 8న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, వై.ఎస్. షర్మిల, అలాగే వై.ఎస్. విజయమ్మ హాజరయ్యే అవకాశం ఉంది.
జగన్, షర్మిల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇద్దరూ తల్లి విజయమ్మ సమక్షంలో కలిసి వైఎస్సార్కు నివాళులర్పిస్తారా లేదా అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఈ కార్యక్రమంలో వారు కలిసి కనిపిస్తారా లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.