BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

Punganur: సర్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్‌పై టీడీపీ సమావేశం.. 14 రోజులు అప్రమత్తంగా ఉండాలి: చల్లా బాబురెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Jun, 2026 - 07:06 AM
26 వీక్షణలు

అన్నమయ్య జిల్లా | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లాలో సోమవారం సర్ (Special Intensive Revision) ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమంపై రూరల్, అర్బన్ క్లస్టర్‌లు, యూనిట్ ఇన్‌చార్జులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి) సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాబోయే 14 రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ప్రభుత్వం నియమించిన బీఎల్‌ఏలతో (BLA) సమన్వయం చేసుకుంటూ ప్రతి నాయకుడు, కార్యకర్త ఓటర్ల వివరాల పరిశీలనలో భాగస్వాములు కావాలని కోరారు. బీఎల్‌ఏలు సక్రమంగా విధులు నిర్వహించకపోతే వారి వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి 24 గంటల్లో చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హెచ్చరించారు.

సమావేశం అనంతరం అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.