BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

Punganur: సర్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్‌పై టీడీపీ సమావేశం.. 14 రోజులు అప్రమత్తంగా ఉండాలి: చల్లా బాబురెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Jun, 2026 - 07:06 AM
63 వీక్షణలు

అన్నమయ్య జిల్లా | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లాలో సోమవారం సర్ (Special Intensive Revision) ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమంపై రూరల్, అర్బన్ క్లస్టర్‌లు, యూనిట్ ఇన్‌చార్జులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి) సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాబోయే 14 రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ప్రభుత్వం నియమించిన బీఎల్‌ఏలతో (BLA) సమన్వయం చేసుకుంటూ ప్రతి నాయకుడు, కార్యకర్త ఓటర్ల వివరాల పరిశీలనలో భాగస్వాములు కావాలని కోరారు. బీఎల్‌ఏలు సక్రమంగా విధులు నిర్వహించకపోతే వారి వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి 24 గంటల్లో చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హెచ్చరించారు.

సమావేశం అనంతరం అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.