ఊటుకూరు: కడియాల సత్యనారాయణకు కాంగ్రెస్ నాయకుల నివాళి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఊటుకూరు: తిరువూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మామ కడియాల సత్యనారాయణ పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న తిరువూరు కాంగ్రెస్ నాయకులు ఊటుకూరులోని ఆయన స్వగృహానికి చేరుకుని సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
అనంతరం పల్లెపాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.
నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ నాయకులు బొడ్డు ప్రకాశరావు, గంజా కృష్ణమోహన్, నల్లమోలు శ్రీనివాస్, జీవన్ బాబు, పర్వతం రామారావు, కుంచం దినేష్, గరికపాటి నరసింహారావు తదితరులు ఉన్నారు.