BREAKING
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.
www.ntodaynews.com

ఊటుకూరు కోదండరామస్వామి ఆలయంలో శాకాంబరి అలంకరణ వైభవం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 11:24 AM
28 వీక్షణలు

ఊటుకూరు కోదండరామస్వామి ఆలయంలో శాకాంబరి అలంకరణ వైభవం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా సోమవారం శాకాంబరి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కోదండరామస్వామిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించగా, రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు బెండకాయ, దొండకాయ, వంకాయ, చిక్కుడు, క్యారెట్, బీట్‌రూట్, సొరకాయ, గుమ్మడికాయ, కాప్సికం, వివిధ ఆకుకూరలతో శాకాంబరి అలంకరణ చేశారు. ఆలయం వెలుపల కూడా కూరగాయల దండలతో సుందరంగా అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు.

ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీ శ్రీనివాస సూరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు హరేరామ నామసంకీర్తనతో పాటు విష్ణు, లలిత పారాయణాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారు, అమ్మవార్ల దర్శనం చేసుకుని కదంబం ప్రసాదాన్ని స్వీకరించారు.

ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ పద్మనాభుని సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యులు చెరుకూరి చిట్టెమ్మ, చావా శ్రీనివాసరావు, జక్కుల కృష్ణ, తమ్మిశెట్టి నాగరాజు, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, గుంతా కిషోర్, ముత్యాల నాగేంద్రరావు, జిక్కుల నరసింహారావు పర్యవేక్షించారు.