BREAKING
రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి
Date of Publish : 10 September 2026, 02:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లి: మానవత్వం చాటుకున్న బూత్ కన్వీనర్ ఏసుబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 02:27 PM
2 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దతండాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి సమస్య తలెత్తింది. సరైన వర్షాలు లేకపోవడంతో పంచాయతీ మోటార్లలో నీటి లభ్యత తగ్గిపోయి, గత కొన్ని రోజులుగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను గ్రామ నాయకులు డి.మంగయ్య దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పోతనపల్లి బూత్ కన్వీనర్ బాణావతు ఏసుబాబుతో మాట్లాడారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ఏసుబాబు తన వ్యవసాయ బోరు నుంచి నీటిని గ్రామ అవసరాలకు అందించేందుకు ముందుకు వచ్చారు.

దీంతో గ్రామ నీటి సహాయకుడు డి.శ్రీను ద్వారా వ్యవసాయ బోరు నీటిని పంచాయతీ పైపులైనుకు అనుసంధానం చేశారు. దీంతో పెద్దతండా ప్రజలకు నీటి ఇబ్బందులు కొంతవరకు తొలగడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు సహాయం అందించిన బాణావతు ఏసుబాబుకు, సమస్యను తన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన డి.మంగయ్యకు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజల అవసరాల సమయంలో స్పందించి సహాయం చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.