BREAKING
భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం
www.ntodaynews.com

ఊటుకూరుకు అరుదైన గౌరవం ఏపీ శ్రీ కోదండరామస్వామి ఉత్తమ ఆలయ చైర్మన్‌గా పద్మనాభుని సర్వేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 05:02 PM
22 వీక్షణలు

ఊటుకూరుకు అరుదైన గౌరవం ఏపీ శ్రీ కోదండరామస్వామి ఉత్తమ ఆలయ చైర్మన్‌గా పద్మనాభుని సర్వేశ్వరరావు

గంపలగూడెం, ఆగస్టు 2: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన పద్మనాభుని సర్వేశ్వరరావుకు "ఏపీ శ్రీ కోదండరామస్వామి ఉత్తమ ఆలయ చైర్మన్" పురస్కారం లభించింది. ఆదివారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ సువర్ణ కంకణ అవార్డుల కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.

లలిత కళా సమాఖ్య సామాజిక, సేవా, సాంస్కృతిక సంస్థతో పాటు రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఎంపిక చేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఊటుకూరు శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో గత కొన్నేళ్లుగా సర్వేశ్వరరావు చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు, భక్తి సేవా కార్యక్రమాలు, దేవాలయ అభివృద్ధికి చేసిన విశేష కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

రుద్రాక్ష వైభవం అధ్యక్షుడు డాక్టర్ కృష్ణ చాముండేశ్వరి మహర్షి, ఎమ్మెల్సీ దయానంద గుప్తా, సినీ నటుడు జనార్ధనరావు, సీవీ రామన్ అకాడమీ ప్రధాన కార్యదర్శి మహేంద్రవాడ వెంకటేశ్వరరావు సంయుక్తంగా సర్వేశ్వరరావుకు పురస్కారాన్ని అందజేశారు.

అవార్డు అందుకున్న సందర్భంగా సర్వేశ్వరరావు మాట్లాడుతూ, ఇది తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, ఊటుకూరు గ్రామ ప్రజలు, దేవాలయ భక్తులు, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరి సహకారానికి దక్కిన గుర్తింపని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పెనుగొలను శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, భక్తులు, పలు సామాజిక, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు సర్వేశ్వరరావును ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.