BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 12 February 2026, 09:42 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి

తెలంగాణ
12 Feb, 2026 - 09:42 AM
332 వీక్షణలు
కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి: ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ NTODAY NEWS: తుర్కపల్లి మండలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్, ఉపాధి చట్ట సవరణలు, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుర్కపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం తెలుగు తల్లి విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు మరియు సాధారణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే కార్మికులు ఇప్పటివరకు పొందుతున్న చట్టపరమైన హక్కులు, రక్షణలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా కార్మికులను పనిలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని, యూనియన్ కార్యకలాపాలు కష్టతరమవుతాయని అన్నారు. స్కీమ్ వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపే ప్రయత్నం జరుగుతోందని, ఇది రైతులపై అదనపు భారం మోపే అవకాశముందని తెలిపారు. విత్తన సవరణ బిల్లుతో విత్తనాల ధరలు పెరిగి రైతులకు నష్టమని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచడం లేదని, ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించడం అసాధ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు ఇస్తూ, రైతులు మరియు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, గ్రామపంచాయతీ యూనియన్ ప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ సంఘాల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. #Turkapally #AIDWA #LabourCodes #FarmersIssues #PowerAmendmentBill #SeedBill #WorkersProtest #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube