BREAKING
జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం
www.ntodaynews.com

వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి

తెలంగాణ
12 Feb, 2026 - 09:42 AM
225 వీక్షణలు
కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి: ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ NTODAY NEWS: తుర్కపల్లి మండలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్, ఉపాధి చట్ట సవరణలు, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుర్కపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం తెలుగు తల్లి విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు మరియు సాధారణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే కార్మికులు ఇప్పటివరకు పొందుతున్న చట్టపరమైన హక్కులు, రక్షణలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా కార్మికులను పనిలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని, యూనియన్ కార్యకలాపాలు కష్టతరమవుతాయని అన్నారు. స్కీమ్ వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపే ప్రయత్నం జరుగుతోందని, ఇది రైతులపై అదనపు భారం మోపే అవకాశముందని తెలిపారు. విత్తన సవరణ బిల్లుతో విత్తనాల ధరలు పెరిగి రైతులకు నష్టమని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచడం లేదని, ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించడం అసాధ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు ఇస్తూ, రైతులు మరియు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, గ్రామపంచాయతీ యూనియన్ ప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ సంఘాల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. #Turkapally #AIDWA #LabourCodes #FarmersIssues #PowerAmendmentBill #SeedBill #WorkersProtest #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube