పాడి రైతు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న విజయ డైరీ ‘కళ్యాణమస్తు’
తిరువూరు క్లస్టర్ పరిధిలో కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కళ్యాణమస్తు’ కార్యక్రమం చాట్రాయి మండలం టీ.గుడిపాడు డబ్ల్యూఎంపీఏ సంఘంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కొండేటి శ్యామల కుమారుడు పవన్ కుమార్ వివాహం, పామర్తి సరోజినీ కుమారుడు శైలేంద్ర రావు వివాహాల సందర్భంగా, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రవేశపెట్టిన కళ్యాణమస్తు పథకం ద్వారా ఇద్దరు వరులకు చెరో ₹20,000 విలువైన గోల్డ్ కాయిన్ను అందజేశారు. మొత్తం ₹40,000 విలువైన రెండు గోల్డ్ కాయిన్లను బోర్డు డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు, తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి. ప్రసాద్, సంఘ అధ్యక్షురాలు బలుసు రాజ్యలక్ష్మి చేతుల మీదుగా అందించారు.
ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు, సూపర్వైజర్ బి. శివ నాగేశ్వరరావు, వేతన కార్యదర్శి తాతయ్య బాబు, రైతులు పాల్గొన్నారు. రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న చైర్మన్ చలసాని ఆంజనేయులకు పాల్గొన్న వారు కృతజ్ఞతలు తెలిపారు.