BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

పాలకుర్తిలో గోమాతలకు రాఖీలు కట్టిన కుటుంబం.....

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 02:56 PM
20 వీక్షణలు

పాలకుర్తిలో గోమాతలకు రాఖీలు కట్టిన కుటుంబం.. జీవకారుణ్యంతో వినూత్న రక్షాబంధన్ వేడుకలు

జనగామ జిల్లా పాలకుర్తి:

రక్షాబంధన్ పండుగను వినూత్నంగా నిర్వహిస్తూ పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాలలో ఓ కుటుంబం గోమాతలపై తమ ప్రేమాభిమానాలను చాటుకుంది. సాధారణంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య జరిగే రాఖీ వేడుకలను గోవులతో నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.

అర్చకుల వేదమంత్రాల నడుమ గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవగిరి భార్గవి గోమాతలకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గోవులకు దీపహారతి ఇచ్చి పూజలు చేశారు.

రక్షాబంధన్ సందర్భంగా స్వీట్లకు బదులుగా గోవులకు అరటిపండ్లు, ఆకుకూరలతో విందు ఏర్పాటు చేశారు. గోవులను కేవలం పెంపుడు జంతువులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఈ వేడుకలు నిర్వహించడం పలువురిని ఆకట్టుకుంది.

మూగజీవుల పట్ల ప్రేమ, కరుణను చాటుతూ సంప్రదాయానికి జీవకారుణ్యాన్ని జోడించిన ఈ వినూత్న రక్షాబంధన్ వేడుకలు పాలకుర్తిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోమాతలతో నిర్వహించిన ఈ వేడుకలు స్థానికుల ప్రశంసలు అందుకున్నాయి.