పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి పై రాయవరపు సీతారాములు అభినందనలు
పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి పై రాయవరపు సీతారాములు అభినందనలు
చాట్రాయి: బుధవారం పామాయిల్ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి. ఎంపీగా గెలిచిన తర్వాత పామాయిల్ రైతులతో ఒక సదస్సు నిర్వహించి, వారి సమస్యలను విన్న ఆయన, ఆ సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సమస్య పరిష్కారం సాధించడమే కాకుండా, పామాయిల్ మద్దతు ధరను 16,500 రూపాయలుగా నిర్ణయించారు.
తర్వాత, డిమాండ్ ఆధారంగా ఈరోజు 22,936 రూపాయల మద్దతు ధర పెరిగింది. దీని ద్వారా రైతులకు పెద్ద ప్రయోజనం చేకూరింది. ఈ సందర్భంగా, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైతుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అలాగే, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కూడా తమ మద్దతు మరియు కృషికి రైతులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అని రాయవరపు సీతారాములు తెలిపారు.