బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రికి హర్షం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు..
పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హర్షం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు..
అమరావతి రాజధాని కావడం తో పుంగనూరు లో మరో దీపావళి..
పుంగనూరు రూరల్ టిడిపి నాయకులు, కార్యకర్తల్లో ఆనందం...
జై అమరావతి జై జై అమరావతి నినాదాలతో దద్దరిల్లిన అంబేత్కర్ సర్కిల్..
భారీ బాణాసంచా,కాకడాలు చేతబట్టి సంతోషం తో సంబరాలు..
అమరావతి రాజధాని సంబరాల్లో స్వీట్ లు పంచుకున్న తెలుగు తమ్ముళ్లు..
అన్నమయ్య జిల్లా,పుంగనూరు అంబేత్కర్ సర్కిల్ లో గురువారం సాయంత్రం టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, TNSF రాష్ట్రా అధికార ప్రతినిధి మార్పురి రమేష్,సీనియర్ నాయకులు రామయ్య, సీనియర్ న్యాయవాది ఎల్. వి రమణ, చిన్న మోహన్ నాయుడు, వీరుపాక్షి నాయుడు, గంగరాజు ల ఆధ్వర్యంలో అంబేద్కర్ కి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రాజధాని గా అమరావతి కావడం చాలా శుభపరిణామం అని అన్నారు.నేటితో
ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని, అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతీ ఆంధ్రుడికి గర్వకారణం అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కూటమి నాయకులకు పార్లమెంట్ లో ఆమోదం తెలిపిన అన్ని రాజకీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.