పేద వాడి భూమి.. ఐతే 1బి పేరు మార్పు చేసిన రెవిన్యూ అధికారులు.
పేద వాడి భూమి.. ఐతే 1బి పేరు మార్పు చేసిన రెవిన్యూ అధికారులు.
ఎమ్మార్వో సారు మా భూమి మాకు ఇప్పించండి...!
మోస పోయిన పేదవారు పట్టించు కొని అధికారులు.
పేదోడి భూమిని దోచేసి పెద్దోడి కి పట్టం కట్టారు..
వీఆర్వో మమ్మల్ని చిల్లర తీసుకొని న్యాయం చేసుకోమని సలహాలు ఇస్తున్నాడు.. ఇదేక్కడి న్యాయం..!
వేలిముద్ర వేసే లక్ష్మ్మమ్మ, చెన్నారాయప్ప ల పేర్ల తో సంతకాలు పోర్జరీ చేసి హంద్రీ నివా డబ్బులు సుమారు ఏడు లక్షలు కూడా ఖాజేశారు.
మా భూమి ని దౌర్జన్యం గా లాక్కొని టమోటా పంట వేసుకొన్నారు.
మాపై దాడి చేసారని పోలిస్టేషన్ లో కూడా పిర్యాదు చేసాము.
అన్నమయ్య జిల్లా,పుంగనూరు మండలం లక్కుంట గ్రామ సమీపంలో రాగాని పల్లె పంచాయితీ డీకేటి సర్వే నెంబర్ 337/3, ఖాతా 113, 2ఎకరాల నలభై ఎనిమిది సెంట్ల భూమి ని 2010లో ఎస్.చెన్నారాయప్ప పేరు మీద పాస్ బుక్ ఉన్నది. ఐతే ఇప్పుడు 1బి లో మారిపోయిందని భాధితుడి భార్య లక్ష్మమమ్మ మీడియా ను సంప్రదించింది.మా భూమి లో సంవత్సరాలు తరపడి వ్యవసాయం చేసుకొంటూ ఉన్నామని,మా భూమి ని రెవిన్యూ వారు వేరొకరి పేరు మీద 1బి ఎలా ఇస్తారని,పేదలకు ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమి ని చంద్రప్ప,గౌరమ్మ లు సంపన్నులకు ఎలా ఫేక్ పట్టా ఎలా ఇస్తారని, ఎమ్మార్వో కి పిర్యాదు చేసిన న్యాయం జరగక పోవడం తో దీనిపై కలెక్టర్ వారికీ పిర్యాదు చేశామని,న్యాయస్థానం లో కూడా కేసు వేశామని మా భూమి మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరారు.