BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

పచ్చిరొట్ట ఎరువులతో భూమి సారాన్ని పెంచాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 07:52 AM
167 వీక్షణలు

పచ్చిరొట్ట ఎరువులతో భూమి సారాన్ని పెంచాలి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని రైతులు వరి, మొక్కజొన్న పంటల కోతల అనంతరం పచ్చిరొట్ట ఎరువుల సాగు చేపట్టి భూమిని సారవంతం చేయాలని మండల వ్యవసాయాధికారి బి. శివశంకర్ సూచించారు. జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేయడం ద్వారా భూమిలో నత్రజని స్థాపితం అవుతుందని తెలిపారు. నవధాన్యాల సాగు విధానంలో లెగ్యుమినేసి జాతి మొక్కలు భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

ఈ పంటలను పూత దశలో కలియదున్నడం వల్ల నెల రోజుల్లోనే సేంద్రియ కర్బన పదార్థం పెరిగి, భూమిలో సూక్ష్మజీవుల వృద్ధి రేటు అధికమవుతుందని వివరించారు. దీంతో భూమి సారం పెరిగి తదుపరి పంటలకు అధిక దిగుబడులు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం మండలంలోని 13 రైతు సేవ కేంద్రాలలో 296 క్వింటాళ్ల జీలుగ, 54 క్వింటాళ్ల జనుము, 33 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను రైతులకు 50 శాతం రాయితీపై అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రైతులు పచ్చిరొట్ట సాగు చేపట్టి భూతల్లిని కాపాడుకోవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపాలని కోరారు.

ఈ సందర్భంగా చాట్రాయి రైతు సేవ కేంద్రం వద్ద రైతులకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బసవారెడ్డి, జగన్ లు మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువుల సాగు వల్ల భూమి సారం పెరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.