పచ్చిరొట్ట విత్తనాలతో భూమి సారాన్ని పెంచుకోవాలి
పచ్చిరొట్ట విత్తనాలతో భూమి సారాన్ని పెంచుకోవాలి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో గ్రామ ఏఈవో ఆధ్వర్యంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాల సాగు ద్వారా భూమి సారవంతం అవుతుందని, రసాయన ఎరువుల వినియోగం తగ్గి రైతులకు ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. జిలుగు, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేసి భూమిలో నత్రజని శాతం పెంచుకోవచ్చన్నారు. దీంతో వరి, మొక్కజొన్న పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.
రైతులు అందరూ పచ్చిరొట్ట సాగుపై అవగాహన పెంచుకొని ప్రకృతి అనుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని కోరారు.