BREAKING
పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఘన సన్మానం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీ..! రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌.. 36 రోజుల పాటు ముహూర్తాలకు విరామం ఊపిరి పీల్చుకున్న విజయ్.. భారీ విజయం.. ఇక ఢోకా లేనట్టే..! సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం! CM వాహన శ్రేణికి కత్తెర.. 50 శాతం తగ్గింపునకు ఆదేశాలు పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఘన సన్మానం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీ..! రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌.. 36 రోజుల పాటు ముహూర్తాలకు విరామం ఊపిరి పీల్చుకున్న విజయ్.. భారీ విజయం.. ఇక ఢోకా లేనట్టే..! సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం! CM వాహన శ్రేణికి కత్తెర.. 50 శాతం తగ్గింపునకు ఆదేశాలు
www.ntodaynews.com

పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
14 May, 2026 - 07:41 AM
13 వీక్షణలు

NTODAY NEWS  నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన విద్యార్థి బత్తుల శశాంక్ పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుకున్న శశాంక్, 10వ తరగతిలో ఫలితాలలో 561 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలోనే కాకుండా గ్రామ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ​ఈ సందర్భంగా నకిరేకల్ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ వేముల వీరేశం  విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. శశాంక్ సాధించిన విజయానికి గుర్తింపుగా ఆయన చేతుల మీదుగా మెమెంటో అందజేసి, విద్యార్థిని మరియు వారి తండ్రి బత్తుల చిన్న మల్లయ్యను ఘనంగా సన్మానించారు. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేముల వీరేశం  మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విటమిన్లతో కూడిన స్నాక్స్ మరియు రాగిజావను ప్రభుత్వం అందిస్తోందని గుర్తుచేశారు. ఈ  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, మండల విద్యాధికారి సైదా నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించిన శశాంక్‌ను గ్రామస్తులందరూ అభినందనలతో ముంచెత్తారు.