BREAKING
Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
www.ntodaynews.com

పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
14 May, 2026 - 07:41 AM
68 వీక్షణలు

NTODAY NEWS  నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన విద్యార్థి బత్తుల శశాంక్ పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుకున్న శశాంక్, 10వ తరగతిలో ఫలితాలలో 561 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలోనే కాకుండా గ్రామ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ​ఈ సందర్భంగా నకిరేకల్ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ వేముల వీరేశం  విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. శశాంక్ సాధించిన విజయానికి గుర్తింపుగా ఆయన చేతుల మీదుగా మెమెంటో అందజేసి, విద్యార్థిని మరియు వారి తండ్రి బత్తుల చిన్న మల్లయ్యను ఘనంగా సన్మానించారు. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేముల వీరేశం  మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విటమిన్లతో కూడిన స్నాక్స్ మరియు రాగిజావను ప్రభుత్వం అందిస్తోందని గుర్తుచేశారు. ఈ  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, మండల విద్యాధికారి సైదా నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించిన శశాంక్‌ను గ్రామస్తులందరూ అభినందనలతో ముంచెత్తారు.