BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:25 PM
22 వీక్షణలు

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

తూర్పు గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హాజరై, పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించారు.

పదవీ విరమణ పొందిన అధికారుల్లో డి. పోలరాజు (ఎస్సై – 2 టౌన్ పోలీస్ స్టేషన్), ఎల్. కనకరాజు (ఎస్సై – డి.సి.ఆర్.బి), సి.హెచ్. శ్రీనివాస్ (ఏఎస్ఐ – 3 టౌన్ పోలీస్ స్టేషన్), డి. విజయరావు (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్) ఉన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు సుమారు నాలుగు దశాబ్దాల పాటు క్రమశిక్షణ, అంకితభావంతో మచ్చలేని సేవలు అందించారని కొనియాడారు. పోలీస్ విధుల్లో వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి ప్రజల సేవకు ప్రాధాన్యత ఇచ్చిన వారి సేవలు ఆదర్శప్రాయమన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యుల సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

పదవీ విరమణ అనంతరం కూడా వ్యక్తిగత లేదా శాఖాపరమైన సమస్యలు ఎదురైనా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అధికారులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బి. రామకృష్ణ (ఎస్‌బి డిఎస్పి), ఏ. శివప్రియ (సౌత్ జోన్ డిఎస్పి)తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.