BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:25 PM
15 వీక్షణలు

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

తూర్పు గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హాజరై, పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించారు.

పదవీ విరమణ పొందిన అధికారుల్లో డి. పోలరాజు (ఎస్సై – 2 టౌన్ పోలీస్ స్టేషన్), ఎల్. కనకరాజు (ఎస్సై – డి.సి.ఆర్.బి), సి.హెచ్. శ్రీనివాస్ (ఏఎస్ఐ – 3 టౌన్ పోలీస్ స్టేషన్), డి. విజయరావు (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్) ఉన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు సుమారు నాలుగు దశాబ్దాల పాటు క్రమశిక్షణ, అంకితభావంతో మచ్చలేని సేవలు అందించారని కొనియాడారు. పోలీస్ విధుల్లో వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి ప్రజల సేవకు ప్రాధాన్యత ఇచ్చిన వారి సేవలు ఆదర్శప్రాయమన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యుల సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

పదవీ విరమణ అనంతరం కూడా వ్యక్తిగత లేదా శాఖాపరమైన సమస్యలు ఎదురైనా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అధికారులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బి. రామకృష్ణ (ఎస్‌బి డిఎస్పి), ఏ. శివప్రియ (సౌత్ జోన్ డిఎస్పి)తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.