BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:25 PM
92 వీక్షణలు

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

తూర్పు గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హాజరై, పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించారు.

పదవీ విరమణ పొందిన అధికారుల్లో డి. పోలరాజు (ఎస్సై – 2 టౌన్ పోలీస్ స్టేషన్), ఎల్. కనకరాజు (ఎస్సై – డి.సి.ఆర్.బి), సి.హెచ్. శ్రీనివాస్ (ఏఎస్ఐ – 3 టౌన్ పోలీస్ స్టేషన్), డి. విజయరావు (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్) ఉన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు సుమారు నాలుగు దశాబ్దాల పాటు క్రమశిక్షణ, అంకితభావంతో మచ్చలేని సేవలు అందించారని కొనియాడారు. పోలీస్ విధుల్లో వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి ప్రజల సేవకు ప్రాధాన్యత ఇచ్చిన వారి సేవలు ఆదర్శప్రాయమన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యుల సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

పదవీ విరమణ అనంతరం కూడా వ్యక్తిగత లేదా శాఖాపరమైన సమస్యలు ఎదురైనా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అధికారులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బి. రామకృష్ణ (ఎస్‌బి డిఎస్పి), ఏ. శివప్రియ (సౌత్ జోన్ డిఎస్పి)తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.