BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు యువకులు గల్లంతు

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:16 PM
29 వీక్షణలు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.

ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఓగిడి గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు పెరవలిలో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా కారు ఒక్కసారిగా అదుపు తప్పి కాలువలోకి పడిపోయింది.

ప్రమాద సమయంలో ఒక యువకుడు కారులో నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగా, మిగిలిన నలుగురు కారుతో పాటు నీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు.

గల్లంతైన వారిని పోతుల లక్ష్మీ భాను (18), రాజారామ్ (17), నాగిరెడ్డి దుశ్వంత్ (18), సాయి సూర్య (19)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గజ ఈతగాళ్ల సహాయంతో కాలువలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఓగిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో తెలియదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.