BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

పెనుగొలను అంగన్వాడీలో వనజీవి రామయ్య జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
92 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను అంగన్వాడీలో బుధవారం పద్మశ్రీ పురస్కార గ్రహీత దరిపల్లి రామయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, వనజీవి రామయ్య జీవితాంతం పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ల పక్కన, ఆలయాల్లో, ఖాళీ స్థలాల్లో ప్రతిరోజూ మొక్కలు నాటి పచ్చదన పరిరక్షణకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

కోటికి పైగా మొక్కలు నాటి పర్యావరణ సేవలో అరుదైన రికార్డు సృష్టించిన మహనీయుడిగా వనజీవి రామయ్య నిలిచిపోయారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు, నాటిన చెట్లు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

వనజీవి రామయ్య జీవిత చరిత్ర, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో, మహారాష్ట్ర ప్రభుత్వం 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో చేర్చడం ఆయన సేవలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, స్థానిక మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.