www.ntodaynews.com
పెనుగొలనులో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చీరాల-పేరాల ఉద్యమాన్ని నడిపి ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన మహనీయుడిగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను వక్తలు స్మరించారు.
తెలుగు జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల అభివృద్ధి మరియు వ్యాప్తికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు బొర్ర అనసూయ, దేవరపల్లి లీల తదితరులు పాల్గొన్నారు.