BREAKING
కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం ​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ ఆగిరిపల్లిలో రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరిక పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు ​లక్షెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ​కాంగ్రెస్ పార్టీ పదవుల్లో పద్మశాలీయులకు తీవ్ర అన్యాయం ​ఘనంగా 31వ రోజు ‘దివాకరన్న పెరుగన్నం’ పంపిణీ పెనుగొలనులో ఘనంగా మహారాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు పర్వతాపురంలో విషాదం.. కరెంట్ షాక్‌తో రెండు పాడి గేదెల మృతి ​ఇంటిపై ‘సోలార్‌’.. లక్ష రూపాయల సబ్సిడీ కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం ​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ ఆగిరిపల్లిలో రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరిక పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు ​లక్షెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ​కాంగ్రెస్ పార్టీ పదవుల్లో పద్మశాలీయులకు తీవ్ర అన్యాయం ​ఘనంగా 31వ రోజు ‘దివాకరన్న పెరుగన్నం’ పంపిణీ పెనుగొలనులో ఘనంగా మహారాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు పర్వతాపురంలో విషాదం.. కరెంట్ షాక్‌తో రెండు పాడి గేదెల మృతి ​ఇంటిపై ‘సోలార్‌’.. లక్ష రూపాయల సబ్సిడీ
www.ntodaynews.com

పెనుగొలనులో ఘనంగా మహారాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 May, 2026 - 01:27 PM
10 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహారాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహారాణి అహల్యబాయి హోల్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరాఠా సామ్రాజ్యంలో మొఘలుల దాడులతో ధ్వంసమైన అనేక హిందూ దేవాలయాలను పునర్నిర్మించడంతో పాటు కొత్త ఆలయాలు, ఘాట్‌లు, ధర్మశాలల నిర్మాణానికి అహల్యబాయి విశేష కృషి చేశారని వక్తలు కొనియాడారు.

కార్యక్రమంలో భాగంగా సాయిబాబా కమిటీ సభ్యులు "కాశీ మహా క్షేత్ర వైభవం" పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ వేడుకల్లో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ళ యుగంధర్, జిల్లా సమన్వయకర్త అన్నవరపు క్రాంతి కుమార్, సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.