పెనుగొలనులో ఘనంగా మహారాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహారాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహారాణి అహల్యబాయి హోల్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరాఠా సామ్రాజ్యంలో మొఘలుల దాడులతో ధ్వంసమైన అనేక హిందూ దేవాలయాలను పునర్నిర్మించడంతో పాటు కొత్త ఆలయాలు, ఘాట్లు, ధర్మశాలల నిర్మాణానికి అహల్యబాయి విశేష కృషి చేశారని వక్తలు కొనియాడారు.
కార్యక్రమంలో భాగంగా సాయిబాబా కమిటీ సభ్యులు "కాశీ మహా క్షేత్ర వైభవం" పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ వేడుకల్లో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ళ యుగంధర్, జిల్లా సమన్వయకర్త అన్నవరపు క్రాంతి కుమార్, సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.