BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

నరసింహారావుపాలెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 03:25 PM
39 వీక్షణలు

చాట్రాయి, జూలై 15: చాట్రాయి మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నీనో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.

పంట నష్టాల నుంచి ఆర్థిక భద్రత కల్పించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. రుణం తీసుకోని రైతులు వరి పంటకు ఎకరానికి రూ.840, మినుములకు రూ.300, ప్రత్తికి రూ.1,900, నిమ్మకు రూ.2,500 ప్రీమియం చెల్లిస్తే బీమా సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం సంభవించినప్పుడు ఈ బీమా రైతులకు ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.

వ్యవసాయ అవసరాలకు సంబంధించిన యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు పీఏసీఎస్ సంఘాలు, రిటైల్ ఎరువుల దుకాణాల్లో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు అవసరమైన ఎరువులను అధికారిక విక్రయ కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే వ్యవసాయ శాఖ అందిస్తున్న డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఏపీఏఐఎంఎస్ యాప్, ఏపీఎఫ్‌ఆర్ సేవల ద్వారా ఎరువుల లభ్యత, ఇతర వ్యవసాయ సమాచారాన్ని సులభంగా పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.