BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

నరసింహారావుపాలెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 03:25 PM
159 వీక్షణలు

చాట్రాయి, జూలై 15: చాట్రాయి మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నీనో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.

పంట నష్టాల నుంచి ఆర్థిక భద్రత కల్పించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. రుణం తీసుకోని రైతులు వరి పంటకు ఎకరానికి రూ.840, మినుములకు రూ.300, ప్రత్తికి రూ.1,900, నిమ్మకు రూ.2,500 ప్రీమియం చెల్లిస్తే బీమా సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం సంభవించినప్పుడు ఈ బీమా రైతులకు ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.

వ్యవసాయ అవసరాలకు సంబంధించిన యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు పీఏసీఎస్ సంఘాలు, రిటైల్ ఎరువుల దుకాణాల్లో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు అవసరమైన ఎరువులను అధికారిక విక్రయ కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే వ్యవసాయ శాఖ అందిస్తున్న డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఏపీఏఐఎంఎస్ యాప్, ఏపీఎఫ్‌ఆర్ సేవల ద్వారా ఎరువుల లభ్యత, ఇతర వ్యవసాయ సమాచారాన్ని సులభంగా పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.