BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఓటర్ సమగ్ర జాబితా సర్వేలో నిజాయితీగా విధులు నిర్వహించిన బీఎల్‌ఓ శ్రీలేఖకు అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 03:25 PM
17 వీక్షణలు

ఏలూరు జిల్లా విస్సన్నపేట మండలం కలగర లక్ష్మీపురం పోలింగ్ స్టేషన్ నెం.158లో బీఎల్‌ఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీలేఖ, మండల తహసీల్దార్ లక్ష్మీ, ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించారు.

సర్వే సందర్భంగా ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, సుమలత పేర్లు విస్సన్నపేట మండలం కలగర లక్ష్మీపురం పోలింగ్ స్టేషన్ నెం.158తో పాటు చాట్రాయి మండలం చనుబండ పోలింగ్ స్టేషన్ నెం.4లో కూడా నమోదై ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత వారిని ఫోన్ ద్వారా సంప్రదించి, అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి, లక్ష్మీపురం పోలింగ్ స్టేషన్ నుంచి ఓటర్ల పేర్లను తొలగించి, చాట్రాయి మండలం చనుబండ పోలింగ్ స్టేషన్ నెం.4లో మాత్రమే కొనసాగించేలా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిజాయితీతో విధులు నిర్వహించిన బీఎల్‌ఓ శ్రీలేఖను ప్రత్యేకంగా అభినందించారు. బీఎల్‌ఓలకు సహాయకులుగా ఉండాల్సిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించని పరిస్థితుల్లోనూ, నిర్ణీత గడువులో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఆమె కృషి చేశారని పేర్కొన్నారు. ఇదే విధంగా ప్రతి బీఎల్‌ఓ బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు వెల్ది వెంకటరావు, సీపీఎం మహిళా నాయకురాలు బుర్రి మేరీకుమారి, పంచాయతీ వీఆర్ఏ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.