BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

పెనుగొలనులో ఘనంగా నామా సత్యనారాయణ మూడో వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 11:25 AM
250 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మాజీ ఎన్ఎస్పీ డీసీ చైర్మన్ నామా సత్యనారాయణ మూడో వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నామా సత్యనారాయణ విగ్రహానికి గ్రామ ప్రముఖులు, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన స్మారక సభకు సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు అధ్యక్షత వహించారు.

సభలో వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, నామా సత్యనారాయణ రాజకీయాలకు అతీతంగా సేవలందించారని, తనకు ఓటు వేయని కుటుంబాలకు కూడా ఇళ్లను మంజూరు చేయించి ప్రజాభిమానాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు.

మాజీ సర్పంచి సంగెపు నారాయణ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో నామా సత్యనారాయణ నాలుగు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా నామా సత్యనారాయణ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో చింతలనర్వ మాజీ సర్పంచి యనమద్ది మల్లేశ్వరరావు, కొండపల్లి మురళి, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ దేవరపల్లి రమేష్, కోమ్మినేని వెంకటేశ్వరరావు, పంది వెంకట్రావు, నంబూరి శ్రీనివాసరావు, కొండేటి వెంకటప్ప, సంగెపు గాంధీ, యనమద్ది విజయకుమార్, బొలగాని కృష్ణ, మోట్లకట్ల రాజారెడ్డి, మీనుగు కృష్ణ, పంది కృష్ణ, బొలగాని గోపి తదితరులు పాల్గొన్నారు.