BREAKING
గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు
www.ntodaynews.com

పెనుగొలనులో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 11:24 AM
34 వీక్షణలు

పెనుగొలనులో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ స్నేహబంధాన్ని మరింత బలపరిచారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, నిజమైన స్నేహానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు–కుచేలుడు స్నేహాన్ని పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న కుచేలుడు ద్వారకకు వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు స్వయంగా ఎదురెళ్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడని చెప్పారు. అనంతరం కుచేలుడిని తన సింహాసనంపై కూర్చోబెట్టి స్వయంగా ఆయన పాదాలను కడిగి, ఆ పవిత్ర జలాన్ని తన శిరస్సుపై చల్లుకున్న ఘటన స్నేహానికి అత్యున్నత ఉదాహరణగా నిలిచిందన్నారు.

డబ్బు, హోదా, స్థాయి వంటి వాటికి అతీతంగా నిలిచేది నిజమైన స్నేహమేనని, జీవితాంతం స్నేహాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్నేహితుల దినోత్సవం ఆవిర్భావం, దాని విశిష్టతను వివరించి యువతలో స్నేహం, పరస్పర గౌరవం, సహకార భావన పెంపొందాలని ఆకాంక్షించారు.

అనంతరం సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.