BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ ఉపశమనం

జాతీయం జాతీయం
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
27 Mar, 2026 - 11:22 AM
225 వీక్షణలు

పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ ఉపశమనం 

​కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించనుంది. దీనివల్ల సామాన్యులకు మరియు వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 10 పది రూపాయలు తగ్గించారు. గతంలో ఉన్న రూ. 13 సుంకాన్ని ఇప్పుడు 3 రూపాయలకు కుదించారు. ​ డీజిల్ పై ఉన్న 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పూర్తిగా రద్దు చేసింది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం సామాన్యులపై పడకుండా ఉండాలని, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ ధరలపై పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ ముందస్తు చర్య తీసుకుంది.  ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా పెట్రోల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.  ఈ సుంకం తగ్గింపు వల్ల ఆ కంపెనీలకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ పెరిగిన అంతర్జాతీయ ధరల సర్దుబాటు వల్ల బంకుల్లో రేట్లు వెంటనే భారీగా తగ్గకపోవచ్చు, కానీ ధరలు మరింత పెరగకుండా అడ్డుకునేందుకు ఇది దోహదపడుతుంది.  ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 1.7 లక్షల కోట్ల వరకు రాబడి తగ్గవచ్చని అంచనా. ​విమాన ఇంధనం పై కూడా: విమాన ప్రయాణికులకు ఊరటనిస్తూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై కూడా ప్రభుత్వం కొన్ని పన్ను మినహాయింపులు ప్రకటించింది.