BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 01 June 2026, 08:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ ఆధ్వర్యంలో రోడ్డు నిర్బంధన ధర్నా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 08:49 PM
97 వీక్షణలు

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ ఆధ్వర్యంలో రోడ్డు నిర్బంధన ధర్నా

తాడిపత్రి : తాడిపత్రి నియోజకవర్గంలోని నంద్యాల రోడ్డులో రంగప్ప కాలనీ సమీపంలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో రోడ్డు నిర్బంధన ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు వాహనాల వినియోగం తగ్గించి డబ్బు పొదుపు చేసుకోవాలని చెప్పడం మోసపూరిత వైఖరికి నిదర్శనమని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. దేశ ప్రజలందరినీ ఏకం చేసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని, తదుపరి ఎన్నికల్లో ప్రజల తీర్పుతో ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని హెచ్చరించారు.

ఈ ధర్నాలో సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగ రంగయ్య, చేతివృత్తుల సంఘం నాయకులు సాలెమల సూరి, శీను, నారాయణరెడ్డి, బాల నాయుడు, బాలు, రమణ, మహిళా నాయకులు లక్ష్మీదేవి, రామలచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.