పల్లెరమూడిలో పల్లె నిద్ర కార్యక్రమం…
పల్లెరమూడిలో పల్లె నిద్ర కార్యక్రమం… సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు
నూజివీడు: నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెరమూడి గ్రామంలో ఎస్ఐలు జ్యోతి బాస్, లక్ష్మణ్ బాబు మరియు పోలీసు సిబ్బంది “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
బ్యాంక్ పేరుతో వచ్చే నకిలీ మెసేజ్లు, లింకులను నమ్మవద్దని, OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. బహుమతులు, లాటరీల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లు వచ్చిన వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేస్తే తక్షణ సహాయం అందుతుందని చెప్పారు. గ్రామంలో కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేయడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు.
అలాగే గ్రామ సమస్యలను పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని, అవసరమైతే పోలీసులను సంప్రదించాలని గ్రామస్తులకు సూచించారు.