BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 24 March 2026, 08:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పల్లెరమూడిలో పల్లె నిద్ర కార్యక్రమం…

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 08:41 AM
166 వీక్షణలు

పల్లెరమూడిలో పల్లె నిద్ర కార్యక్రమం… సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు

నూజివీడు: నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెరమూడి గ్రామంలో ఎస్ఐలు జ్యోతి బాస్, లక్ష్మణ్ బాబు మరియు పోలీసు సిబ్బంది “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

బ్యాంక్ పేరుతో వచ్చే నకిలీ మెసేజ్‌లు, లింకులను నమ్మవద్దని, OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. బహుమతులు, లాటరీల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చిన వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేస్తే తక్షణ సహాయం అందుతుందని చెప్పారు. గ్రామంలో కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేయడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు.

అలాగే గ్రామ సమస్యలను పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని, అవసరమైతే పోలీసులను సంప్రదించాలని గ్రామస్తులకు సూచించారు.