BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

పల్నాడు చేపల చెరువుల్లో చికెన్ వ్యర్థాలు.. కలకలం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:16 PM
22 వీక్షణలు

చేపల మేత పేరుతో కోళ్ల వ్యర్థాల వినియోగం? సమగ్ర విచారణకు డిమాండ్

పల్నాడు జిల్లా: చేపలు ఆరోగ్యానికి మంచివని భావించి కొనుగోలు చేసే ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని కొన్ని చేపల చెరువుల్లో కోళ్ల మాంసం వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి కొన్ని చెరువుల్లో వేస్తున్నట్లు సమాచారం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సత్తెనపల్లి, ముప్పాళ్ల, పెదకూరపాడు, అమరావతి, నరసరావుపేట, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో ఈ విధానం కొనసాగుతోందనే ఆరోపణలు గతంలోనూ వినిపించాయి.

చికెన్ వ్యర్థాలను చేపల మేతగా వినియోగించడం వల్ల చెరువుల్లో నీటి కాలుష్యం, దుర్వాసన, పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చేపల రైతులు, స్థానికులు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, మత్స్యశాఖ అధికారులపై కూడా లంచం ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలపై సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.