BREAKING
ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ​అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్ ​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు 175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి! పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మరో బంపర్ ఆఫర్ బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ​అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్ ​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు 175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి! పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మరో బంపర్ ఆఫర్ బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం
www.ntodaynews.com

పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకతకు ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డ్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 May, 2026 - 05:36 PM
36 వీక్షణలు

పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకతకు ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరులో మరింత పారదర్శకత తీసుకురావడానికి ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు శాఖ కార్యకలాపాలు, అభివృద్ధి పనుల పురోగతి స్పష్టంగా కనిపించేలా వ్యవస్థ రూపొందించాలని సూచించారు.

స్వచ్ఛ రథం నమూనాలో గ్రీన్ షాప్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణను సమర్థంగా అమలు చేసి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అలాగే గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి కావాలని అధికారులకు స్పష్టం చేశారు. పనుల్లో ఆలస్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు.

పంచాయతీరాజ్ శాఖ సమీక్ష సమావేశంలో స్వర్ణ పంచాయతీ పోర్టల్, స్వమిత్వ కార్యక్రమం, గ్రామీణ రోడ్ల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.