పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు అవగాహన కార్యక్రమం
కలగర,తెల్లదేవరపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు అవగాహన
విసన్నపేట: ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలంలోని కలగర, తెల్లదేవరపల్లి గ్రామాల్లో "పొలం పిలుస్తోంది" కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంటల సాగులో అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలు, ఎరువుల సమతుల్య వినియోగం, చీడపీడల నివారణ, పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ఏవైనా సమస్యలు ఉంటే సమీప రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి ఉషారాణి, రైతు సేవా కేంద్రం సిబ్బంది అరుణ, వెంకటేశ్వరరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.