BREAKING
పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా కుర్చీ తాత ఇకలేడు... పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా కుర్చీ తాత ఇకలేడు...
www.ntodaynews.com

పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
21 May, 2026 - 09:52 PM
14 వీక్షణలు

పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ..

మదనపల్లిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ 

మదనపల్లి, అన్నమయ్య జిల్లా  మే 21:

అహర్నిశలు ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసు అధికారుల, సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ గురువారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. విధి నిర్వహణలో నిత్యం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పోలీసులు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా, ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ పిలుపునిచ్చారు.

అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సిబ్బందికి అత్యంత కీలకమైన సి.బి.సి (రక్త పరీక్ష), కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలతో పాటు బ్లడ్ షుగర్ మరియు మూత్ర పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పోలీస్

అధికారులు, సిబ్బంది మరియు హోంగార్డులు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సంరక్షణ కోసం ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు.

పోలీసుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన అంజనా డయాగ్నోస్టిక్స్ యాజమాన్యానికి ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి ఏఆర్ డిఎస్పీ శ్రీ డి. ఏడుకొండల రెడ్డి , పలువురు సీఐలు, ఆర్బలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, హోంగార్డులతో పాటు పోలీసు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత మెడికల్ చెకప్ పరీక్షలు చేయించుకున్నారు.