www.ntodaynews.com
పోతనపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో సోమవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్తులకు నాయకులు ఇంటింటికీ వెళ్లి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ధరావతు భాస్కరరావు, 21వ బూత్ కో-కన్వీనర్ ఏసుబాబు, మంగయ్య, సధాకరరావు, కృష్ణప్రసాద్, వెంకట సీతారామయ్య, పెద్ద వెంకటేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.