BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:00 PM
94 వీక్షణలు

ప్రైవేటు విద్య వద్దు.. ప్రభుత్వ బడులే ముద్దు" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పోతనపల్లి, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ పంకజ్ కుమార్, మండల విద్యాశాఖాధికారులు మాసగిరి శ్రీను, వి.ఎస్.వి. బ్రహ్మాచారి, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొని "బడి పిలుస్తోంది" కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు, సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. నాణ్యమైన విద్యను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నట్లు తెలియజేశారు.

మండల విద్యాశాఖాధికారి మాసగిరి శ్రీను మాట్లాడుతూ, విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

అలాగే పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న 14 మంది చిన్నారుల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రుల సమ్మతి తీసుకుని విద్యార్థుల వివరాలను పాఠశాలల్లో నమోదు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సి.ఎమ్.ఓ యెహోషువ, ఏ.ఎల్.ఎస్ నాగేశ్వరరావు, ఐఈ కో-ఆర్డినేటర్ బొర్రా భాస్కరరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్ఎంటీలు, అంగన్‌వాడీ సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.