BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 05:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:00 PM
163 వీక్షణలు

ప్రైవేటు విద్య వద్దు.. ప్రభుత్వ బడులే ముద్దు" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పోతనపల్లి, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ పంకజ్ కుమార్, మండల విద్యాశాఖాధికారులు మాసగిరి శ్రీను, వి.ఎస్.వి. బ్రహ్మాచారి, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొని "బడి పిలుస్తోంది" కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు, సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. నాణ్యమైన విద్యను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నట్లు తెలియజేశారు.

మండల విద్యాశాఖాధికారి మాసగిరి శ్రీను మాట్లాడుతూ, విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

అలాగే పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న 14 మంది చిన్నారుల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రుల సమ్మతి తీసుకుని విద్యార్థుల వివరాలను పాఠశాలల్లో నమోదు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సి.ఎమ్.ఓ యెహోషువ, ఏ.ఎల్.ఎస్ నాగేశ్వరరావు, ఐఈ కో-ఆర్డినేటర్ బొర్రా భాస్కరరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్ఎంటీలు, అంగన్‌వాడీ సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.