BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:00 PM
129 వీక్షణలు

ప్రైవేటు విద్య వద్దు.. ప్రభుత్వ బడులే ముద్దు" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పోతనపల్లి, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ పంకజ్ కుమార్, మండల విద్యాశాఖాధికారులు మాసగిరి శ్రీను, వి.ఎస్.వి. బ్రహ్మాచారి, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొని "బడి పిలుస్తోంది" కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు, సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. నాణ్యమైన విద్యను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నట్లు తెలియజేశారు.

మండల విద్యాశాఖాధికారి మాసగిరి శ్రీను మాట్లాడుతూ, విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

అలాగే పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న 14 మంది చిన్నారుల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రుల సమ్మతి తీసుకుని విద్యార్థుల వివరాలను పాఠశాలల్లో నమోదు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సి.ఎమ్.ఓ యెహోషువ, ఏ.ఎల్.ఎస్ నాగేశ్వరరావు, ఐఈ కో-ఆర్డినేటర్ బొర్రా భాస్కరరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్ఎంటీలు, అంగన్‌వాడీ సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.