బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం
బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం
తొర్రూరు | ఆగస్టు 27 | N Today News
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన రెండు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
మడిపల్లి గ్రామానికి చెందిన గుంటుక రమేష్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డి రమేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.5,000 నగదు, 25 కేజీల బియ్యం అందించారు.
అదే గ్రామానికి చెందిన గొల్లపల్లి ముఖేష్ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కూడా నాయకులు పరామర్శించారు. ముఖేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబానికి రూ.3,000 నగదు, 25 కేజీల బియ్యం అందించారు.
ముఖేష్కు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉండటంతో కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయనతో కలిసి కంటాయపాలెం హైస్కూల్లో 2009–10లో చదువుకున్న స్నేహితులు కూడా అండగా నిలిచారు. స్నేహితులంతా కలిసి రూ.20,500 నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు.
కష్టకాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులను జక్కా మహబూబ్ రెడ్డి అభినందించారు. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సహకారంతో అన్ని విధాలుగా అండగా ఉంటామని నాయకులు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మడిపల్లి మాజీ సర్పంచ్ గడిల మాధవి సాయిలు, వెన్నం సోమిరెడ్డి, వల్లంల వెంకటేశ్వర్లు, రావుల శ్రీనివాస్ రెడ్డి, ఎం.డి. యాకూబ్, మహంకాళి తదితరులు పాల్గొన్నారు.