www.ntodaynews.com
ప్రాణాలకు తెగించి విద్యుత్ సేవలు అందిస్తున్న లైన్ మెన్
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు అందులో భాగంగా చిట్యాల విద్యుత్ శాఖ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు విద్యుత్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజల ఇళ్లలో వెలుగులు నింపేందుకు విద్యుత్ లైన్మెన్లు నిరంతరం శ్రమిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ లోపాలను సరిచేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి స్తంభాలు ఎక్కి విధులు నిర్వహిస్తున్నారు.
వర్షం, చీకటి, ప్రమాదకర పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కృషి చేస్తున్న లైన్మెన్ల సేవలు అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. భద్రతా పరికరాలు, తగిన రక్షణ కల్పిస్తూ వారి సేవలను గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.