విస్సన్నపేటలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక పాల్గొననున్న జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశా
ఎన్టీఆర్ జిల్లా, 11-06-2026: తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక అవకాసం. ఈ నెల 12వ తేదీ శుక్రవారం విస్సన్నపేట మండలంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించబడనుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రకటించారు.
ఈ కార్యక్రమం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. తిరువూరు, ఎ.కొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాల ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీ చేయవచ్చు.
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొని, జిల్లా స్థాయి అధికారులతో కలసి సమస్యలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని అధికారికంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రజలను ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.