www.ntodaynews.com
నరసాపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొంటారు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నర్సాపురం గురుకుల పాఠశాలలో రేపు, అనగా 12-06-2026 ఉదయం 10 గంటలకు, మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయబడుతోంది. ఈ వేదిక ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్కి తెలియజేసి తక్షణ పరిష్కారం పొందగలరు.
టీడీపీ సీనియర్ నేత గోరేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు (బుడ్డయ్య) ప్రజలకు విజ్ఞప్తి చేసి, అన్ని గ్రామాల వారు విరివిగా పాల్గొని తమ సమస్యలకు తక్షణ పరిష్కారం పొందాలని కోరారు.
ప్రజా భాగస్వామ్యం వలన సమస్యలు సమర్థవంతంగా పరిష్కారమవుతాయని అధికారులు తెలిపారు.