BREAKING
గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి.
www.ntodaynews.com

గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
11 Jun, 2026 - 09:30 PM
12 వీక్షణలు

గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.

రైతులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు 

ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి,.

విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులకు రూ.25,00,814ల డివిడెంట్లు మంజూరయ్యాయి.  బుధవారం గొల్లపూడి పి.ఏ.సీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు రైతులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  మాట్లాడుతూ సహకార సంఘాలు లాభాల్లో నడవడం హర్షణీయమన్నారు. రైతులకు డివిడెంట్లు ఇవ్వడం ద్వారా సహకార స్ఫూర్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. పి.ఏ.సీఎస్‌లను బలోపేతం చేసి రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు వడ్డీలేని రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామని వివరించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు వెన్నెముక లాంటివని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించిన రైతులను ఎమ్మెల్యే అభినందించారు. పి.ఏ.సీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఎరువుల విక్రయాలు పారదర్శకంగా జరుగుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు, (గాంధీ) పి.ఏ.సీఎస్ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.