BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
11 Jun, 2026 - 09:30 PM
60 వీక్షణలు

గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.

రైతులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు 

ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి,.

విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులకు రూ.25,00,814ల డివిడెంట్లు మంజూరయ్యాయి.  బుధవారం గొల్లపూడి పి.ఏ.సీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు రైతులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  మాట్లాడుతూ సహకార సంఘాలు లాభాల్లో నడవడం హర్షణీయమన్నారు. రైతులకు డివిడెంట్లు ఇవ్వడం ద్వారా సహకార స్ఫూర్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. పి.ఏ.సీఎస్‌లను బలోపేతం చేసి రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు వడ్డీలేని రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామని వివరించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు వెన్నెముక లాంటివని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించిన రైతులను ఎమ్మెల్యే అభినందించారు. పి.ఏ.సీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఎరువుల విక్రయాలు పారదర్శకంగా జరుగుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు, (గాంధీ) పి.ఏ.సీఎస్ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.