BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
11 Jun, 2026 - 09:30 PM
83 వీక్షణలు

గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.

రైతులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు 

ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి,.

విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులకు రూ.25,00,814ల డివిడెంట్లు మంజూరయ్యాయి.  బుధవారం గొల్లపూడి పి.ఏ.సీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు రైతులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  మాట్లాడుతూ సహకార సంఘాలు లాభాల్లో నడవడం హర్షణీయమన్నారు. రైతులకు డివిడెంట్లు ఇవ్వడం ద్వారా సహకార స్ఫూర్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. పి.ఏ.సీఎస్‌లను బలోపేతం చేసి రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు వడ్డీలేని రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామని వివరించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు వెన్నెముక లాంటివని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించిన రైతులను ఎమ్మెల్యే అభినందించారు. పి.ఏ.సీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఎరువుల విక్రయాలు పారదర్శకంగా జరుగుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు, (గాంధీ) పి.ఏ.సీఎస్ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.