BREAKING
మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం
Date of Publish : 03 September 2026, 02:21 pm
Posted by : కూనురు మధు

ప్రేమ పేరుతో మోసం.. మరో మహిళను పెళ్లాడిన కానిస్టేబుల్ !

తెలంగాణ
/ హైదరాబాద్
03 Sep, 2026 - 02:21 PM
11 వీక్షణలు


 ప్రేమ పేరుతో తనను మోసం చేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడంటూ ఓ యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. లకిడీకాపూల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శెట్టి అరుణ్ కుమార్ (34) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.


యువతి తెలిపిన వివరాల ప్రకారం.. 2013–15లో ఎంటెక్ చదువుతున్న సమయంలో అరుణ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడని పేర్కొంది. ఈ క్రమంలో తాను రెండుసార్లు గర్భం దాల్చగా, అబార్షన్ చేయించాడని ఆరోపించింది. కులం కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడని, చివరకు తనను పెళ్లి చేసుకోకుండా 2026 జూలై 1న మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసం చేసిన కానిస్టేబుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. యువతి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.