ప్రేమ పేరుతో మోసం.. మరో మహిళను పెళ్లాడిన కానిస్టేబుల్ !
ప్రేమ పేరుతో తనను మోసం చేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడంటూ ఓ యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. లకిడీకాపూల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శెట్టి అరుణ్ కుమార్ (34) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.
యువతి తెలిపిన వివరాల ప్రకారం.. 2013–15లో ఎంటెక్ చదువుతున్న సమయంలో అరుణ్ కుమార్తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడని పేర్కొంది. ఈ క్రమంలో తాను రెండుసార్లు గర్భం దాల్చగా, అబార్షన్ చేయించాడని ఆరోపించింది. కులం కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడని, చివరకు తనను పెళ్లి చేసుకోకుండా 2026 జూలై 1న మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసం చేసిన కానిస్టేబుల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. యువతి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.