BREAKING
అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్.....
Date of Publish : 03 September 2026, 02:36 pm
Posted by : DAVU RAVINDER REDDY

లేని ఆస్తుల రిజిస్ట్రేషన్.. రూ.4.11 కోట్ల బ్యాంకు రుణాల మోసం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
03 Sep, 2026 - 02:36 PM
5 వీక్షణలు


చంపాపేట సబ్‌ రిజిస్ట్రార్ అరెస్ట్.. స్కామ్‌లో 29 మంది పాత్ర ఉన్నట్లు గుర్తింపు

హైదరాబాద్ | Ntoday News

లేని ఆస్తులను కాగితాలపై ఉన్నట్లుగా చూపించి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందిన కేసులో చంపాపేట సబ్‌ రిజిస్ట్రార్ మహ్మద్ యూసుఫ్ ఉర్ రెహ్మాన్‌ను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నకిలీ ఆస్తులను చూపించి బ్యాంకుల నుంచి రూ.4.11 కోట్ల రుణాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల దర్యాప్తులో భాగంగా.. గతంలో కీసరలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో యూసుఫ్ ఉర్ రెహ్మాన్ ఉనికిలో లేని 11 ఆస్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలినట్లు సమాచారం.

ఈ కుంభకోణంలో మొత్తం 29 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా చంపాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ను కూడా అరెస్ట్ చేయడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది.

ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? లేని ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఇంకా ఎన్ని లావాదేవీలు జరిగాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.