చంచల్గూడ రోడ్డు బంద్
తెలంగాణ
/
హైదరాబాద్
చంచల్గూడ రోడ్డు బంద్
Hyderabad: సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా చంచల్గూడ డిగ్రీ & జూనియర్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సీఎం రేవంత్ రెడ్డి సభకు సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.
సైదాబాద్ Y జంక్షన్- నల్గొండ X రోడ్ మార్గాన్ని పూర్తిగా మూసేయనున్నారు. ట్రాఫిక్ను మలక్పేట్ గంజ్, మూసారాంబాగ్, గడ్డిఅన్నారం, చాదర్ ఘాట్ మీదుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.