భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు.!
తెలంగాణ
భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు.!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 5వ తేదీ నుంచి సిమెంట్ ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. 50 కిలోల ప్రతి సిమెంట్ సంచిపై రూ.35 నుంచి రూ.45 వరకు ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో బ్రాండ్ను బట్టి రూ.250 నుంచి రూ.280 మధ్యలో లభిస్తుంటే, రిటైల్ మార్కెట్లో బస్తా రూ.270 నుంచి రూ.310 వరకు విక్రయిస్తున్నారు. హోల్సేల్ ధర రూ.320కి చేరితే తప్ప కంపెనీలకు గిట్టుబాటు కాదని వ్యాపార ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.