BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాలపై కట్టుదిట్టమైన తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:56 PM
52 వీక్షణలు

ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాలపై కట్టుదిట్టమైన తనిఖీలు – తిరువూరు చెక్‌పోస్ట్ వద్ద ఫైర్ సిబ్బంది అలర్ట్ 

తిరువూరు: ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కఠిన ఆదేశాలు జారీ చేయడంతో ఫైర్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రమాదాలను ముందుగానే నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల వద్ద విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని తిరువూరు చెక్‌పోస్ట్ వద్ద ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున 6 గంటల నుంచే తనిఖీలు ప్రారంభించారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం వాహనాల పరిశీలన కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.

ప్రత్యేకంగా ప్రైవేట్ బస్సులపై దృష్టి సారించిన సిబ్బంది, ప్రతి బస్సును ఆపి సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు. బస్సుల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, డ్రైవర్‌ల లైసెన్సులను పరిశీలిస్తూ, వాహనంలో సాంకేతిక లోపాలపై సవివరంగా ఆరా తీస్తున్నారు.

ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంధన లీకేజీలు, ఎలక్ట్రికల్ లోపాలు వంటి అగ్ని ప్రమాదాలకు దారితీసే అంశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ప్రజల ప్రాణ భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండి భద్రతా నిబంధనలు పాటించేందుకు సహకరించాలని సూచించారు.

ఈ తనిఖీల్లో ఆర్. బుచ్చిబాబు (లీడింగ్ ఫైర్‌మ్యాన్), ఎస్. తిరుపతి వెంకయ్య (ఫైర్‌మ్యాన్), వై. సత్యనారాయణ (హోమ్ గార్డ్), డి. రాంబాబు (ఫైర్ ఆఫీసర్) పాల్గొని విధులు నిర్వహించారు.