ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ సేవలు
తెలంగాణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ సేవలు
TG : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఫర్టిలిటీ కేంద్రాల్లో ఏఆర్టీ, సరోగసి చట్టాల అమలును కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గాంధీ, పేట్లబుర్జు ఐవీఎఫ్ కేంద్రాల్లో ఇప్పటివరకు 39,802 మందికి సేవలు అందించగా, జిల్లాల్లోనూ దశలవారీగా సేవలు విస్తరించాలని ఆదేశించారు.