ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో 15 మంది పోలీస్ అధికారులకు ప్రతిభ పురస్కారాలు
పతకాలు అందుకున్న పోలీస్ సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం, ఆగస్టు 31: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2026 జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన 15 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి పతకాలు లభించాయి.
ఈ సందర్భంగా సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా పతకాలు అందజేసి పోలీస్ అధికారులను అభినందించారు. విధి నిర్వహణలో ఇదే స్ఫూర్తితో మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఉత్తమ సేవా పతకాలు అందుకున్న వారిలో అడిషనల్ డీసీపీ బి. రామానుజం, హెడ్ కానిస్టేబుళ్లు వి. బిక్షపతి, కె. సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు.
ఉత్తమ సేవా పతకాలు అందుకున్న వారు:
అడిషనల్ డీసీపీ బి. రామానుజం
వి. బిక్షపతి (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్)
కె. సూర్యప్రకాష్ రెడ్డి (హెడ్ కానిస్టేబుల్)
సేవా పతకాలు అందుకున్న పోలీస్ అధికారులు:
కె. నాగేంద్రరావు (ఎస్ఐ)
ఎన్. రామిరెడ్డి (ఏఎస్ఐ)
బి. సుందర్ రావు (ఏఎస్ఐ)
ఎండీ. హలీమ్ (ఏఆర్ఎస్ఐ)
జి. భాస్కర్ రావు (ఏఆర్ఎస్ఐ)
ఎం. వెంకటేశ్వర్లు (హెడ్ కానిస్టేబుల్)
టి. హరిచరణ్ సింగ్ (హెడ్ కానిస్టేబుల్)
ఎస్కే. మదార్ సాహెబ్ (హెడ్ కానిస్టేబుల్)
ఐ. ప్రభాకరరావు (హెడ్ కానిస్టేబుల్)
సీహెచ్. రామారావు (హెడ్ కానిస్టేబుల్)
జె. కృష్ణ (పోలీస్ కానిస్టేబుల్)
డి. సుశీల్ కుమార్ (పోలీస్ కానిస్టేబుల్)
ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ సిబ్బందికి పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.