చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా: నక్కా రాము
ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి మండలం చనుబండలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నక్కా రాము మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తూ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా నిలుస్తోందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, కిడ్నీ బాధితులు గౌరవంగా జీవించేలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రభుత్వం ముందుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రజలు తమ సమస్యలపై సంప్రదించిన వెంటనే స్పందిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం కొనసాగేందుకు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు బన్నీ వీరస్వామి పాల్గొన్నారు.