ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్ లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో, అలాగే 10వ తరగతి తెలుగు మీడియంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 6 నుండి 14 సంవత్సరాల వయసు గల ఉత్తర తెలంగాణ రాష్ట్ర నివాసులైన అంధ బాలబాలికలు అర్హులని, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ జిల్లాల విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్, పాదరక్షలు మరియు ఉచిత వసతి గృహ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన వివరించారు.
ఆసక్తి గల విద్యార్థులు సదరం, యూడీఐడీ (UDID) దివ్యాంగ ధ్రువపత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికెట్ (TC), రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను కరీంనగర్ లోని విజయపురి కాలనీ, మల్కాపూర్ రోడ్డులో గల ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో స్వయంగా అందించాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకోవడానికి 9701190127, 9440338424 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చని పాఠశాల ప్రిన్సిపల్ ఆ ప్రకటనలో కోరారు