ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతుంది.
ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినప్పటినుండి ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన చేస్తున్నారు.
మెడికల్ కాలేజీ ముందు తెలంగాణ ఉద్యమకారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తమ అభిమానులు ఏర్పాటు చేస్తే ఓర్వలేక రాత్రికి రాత్రి కూలగొట్టించారు.
నిరసన తెలియజేస్తుంటే నాయకులను ఎక్కడికి అక్కడ నిర్బంధించారు, ఒకప్పుడు నక్సలైట్లను చేసినట్లు ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులను చేస్తున్నారు.
ఉద్యమ నేత కేసిఆర్ పిలుపుమేరకు ఉద్యమాలు చేశాం, ఏదేమైనా పనికి ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేస్తాం.
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయవచ్చు కానీ ప్రజల మనసుల నుండి ఆయనను దూరం చేయలేరు.
ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తాం ఇళ్ల స్థలాలు ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెబుతున్నారు.
ప్రతిపక్షాల పైన ప్రతీకార చర్యగా అరెస్టు చేసి దూర ప్రాంతాలకు తీసుకొస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు జాగ్రత్త నిర్బంధాలతో మమ్మల్ని ఆపలేరు, ప్రభుత్వ మాజీ చీఫ్ వినయ్ భాస్కర్.