www.ntodaynews.com
ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు
విజయవాడ, జూలై 30: ఈ-బస్సుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది. విజయవాడలో జరిగిన జేఏసీ కీలక సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.
జేఏసీ ప్రకటించిన కార్యక్రమాలు ఇవీ:
ఆగస్టు 3న ముఖ్యమంత్రికి వినతిపత్రాల సమర్పణ.
ఆగస్టు 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద రిలే నిరాహార దీక్షలు.
ఆగస్టు 21న డిపో కార్యాలయాల ఎదుట మహాధర్నా.
ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు జేఏసీ హెచ్చరించింది.
ఈ-బస్సుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రజా రవాణా సేవలను కొనసాగించాలని జేఏసీ డిమాండ్ చేసింది.